దారుణం.. సర్జికల్ కత్తితో ఆరేళ్ల పాప గొంతు కోసిన దుర్మార్గుడు..

మేడ్చల్ జిల్లాల ఇస్మాయిల్ ఖాన్ గూడాలో దారుణం చోటుచేసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్‌లో ఆధ్య అనే ఆరేళ్ళ బాలికను అత్యంత కిరాతకంగా గొంతు కోసి..

దారుణం.. సర్జికల్ కత్తితో ఆరేళ్ల పాప గొంతు కోసిన దుర్మార్గుడు..
Follow us

| Edited By:

Updated on: Jul 02, 2020 | 5:36 PM

మేడ్చల్ జిల్లాల ఇస్మాయిల్ ఖాన్ గూడాలో దారుణం చోటుచేసుకుంది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ విహారి హోమ్స్‌లో ఆధ్య అనే ఆరేళ్ళ బాలికను అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు కరుణాకర్ అనే వ్యక్తి.

వివరాల్లోకి వెళ్తే.. అనూష, కళ్యాణ్ దంపతులు కుమార్తె ఆధ్య. వీరు గత రెండు సంవత్సరాల నుంచి విహారి హోమ్‌లో అద్దెకు ఉంటున్నారు. యాదాద్రి జిల్లా ఆత్మకూర్ విలేజ్‌‌లో గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్నాడు కళ్యాణ్. అయితే అనుష, కరుణాకర్ మధ్య గత కొద్ది రోజుల నుంచి వివాహేతర సంబంధం ఉంది. వీరి సంబంధమే ఈ హత్యకు దారి తీసి ఉండవచ్చని తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం కళ్యాణ్ ఇంట్లో లేని సమయంలో కరుణాకర్ ఇంటి వద్దకు వచ్చి అనూష కూతురు ఆధ్యని దారుణంగా సర్జికల్ కత్తితో హత్య చేశాడు.

గత కొద్ది రోజుల నుంచి అనూష కరుణాకర్‌కి గొడవలు ఉన్న కారణంగా పగ పెంచుకున్న అతను ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు పోలీసులు అంటున్నారు. ఆధ్య తల్లి అనుషా ముందే చిన్నారిని కత్తితో హత్య చేశాడు. అనంతరం కరుణాకర్ కూడా అదే కత్తితో తానూ గాయ పరుచుకున్నాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో స్పాట్‌కు చేరుకున్నారు. గాయపడ్డ కరుణాకర్‌ను అంబులెన్స్‌లో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Read More:

సిగ్గు పడాల్సిన అవసరం లేదు.. ధైర్యంగా ఉండండి: నవ్య స్వామి

27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు.. ఈసారి మట్టితో..

విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఫ్రీగా లాప్‌టాప్స్, ఫోన్స్..