‘ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌ చేరే జట్లు అవే’ డూప్లెసిస్ జోస్యం!

10 జట్లతో 2019 మే30న ప్రారంభమైన వరల్డ్ కప్ సమరం రసవత్తరంగా మారింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో డూప్లెసిస్‌ సెంచరీతో చెలరేగడంతో సఫారీ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డూప్లెసిస్‌ మాట్లాడుతూ… భారత్‌-ఇంగ్లండ్‌ జట్లే ఫైనల్లో తలపడుతాయని జోస్యం చెప్పాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌కు పెద్ద కష్టమైన పనేం కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఓడిస్తుందని తెలిపాడు. ఇక ఆసీస్‌ ఓటమితో […]

'ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌ చేరే జట్లు అవే' డూప్లెసిస్ జోస్యం!
Follow us

| Edited By:

Updated on: Jul 07, 2019 | 3:35 PM

10 జట్లతో 2019 మే30న ప్రారంభమైన వరల్డ్ కప్ సమరం రసవత్తరంగా మారింది. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో డూప్లెసిస్‌ సెంచరీతో చెలరేగడంతో సఫారీ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డూప్లెసిస్‌ మాట్లాడుతూ… భారత్‌-ఇంగ్లండ్‌ జట్లే ఫైనల్లో తలపడుతాయని జోస్యం చెప్పాడు. వరుస ఓటములతో సతమతమవుతున్న న్యూజిలాండ్‌ను ఓడించిన భారత్‌కు పెద్ద కష్టమైన పనేం కాదని అభిప్రాయపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియాను ఇంగ్లండ్‌ ఓడిస్తుందని తెలిపాడు. ఇక ఆసీస్‌ ఓటమితో భారత్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలవగా… సెమీస్‌ ప్రత్యర్థిగా న్యూజిలాండ్‌ ఖరారైంది. మరో సెమీస్ లో ఆసీస్‌ ఇంగ్లండ్‌తో తలప‌డనుంది. గూగుల్‌ సీఈవో సుంద‌ర్‌ పిచాయ్‌ సైతం ఫైనల్లో తలపడేవి భారత్‌- ఇంగ్లండేనని ఇదివరకే స్పష్టం చేశారు. న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలు కూడా బలమైన జట్లేనని, కానీ వీటితో జరిగే పోరులో ఇంగ్లండ్‌, భారత్‌లే పైచేయి సాధిస్తాయని ఆయన పేర్కొన్నారు.