ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను చేర్చాలని ఎప్పటి నుంచో వినిపిస్తున్న డిమాండ్. అయితే ఎట్టకేలకు ఇప్పుడు ఆ నిర్ణయం దిశగా అడుగులు పడ్డాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ కసరత్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు మెరిల్ బోన్ క్రికెట్ కమిటీ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను ప్రవేశపెట్టడానికి ఐసీసీ ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు ఎంసీసీ చైర్మన్ మైక్ గాట్టింగ్. వచ్చే ఏడాదిన్నర కాలంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందన్నారు. ఒలింపిక్స్ కు ఎలా అర్హత పొందాలి అనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లుగా గాటింగ్ వెల్లడించారు. అయితే, ఈ గేమ్స్ నెలరోజుల పాటు కాకుండా రెండు వారాల్లోనే పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఇక ఆసియా గేమ్స్ లోకి త్వరలోనే క్రికెట్ చేరబోతుందని తెలిసి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Breaking News
- అమరావతి: చంద్రబాబును నమ్మి భూములిచ్చి దళిత రైతులు మోసపోయారు. మా ప్రభుత్వ నిర్ణయంతో దళిత రైతులకు న్యాయంజరిగింది-ఎమ్మెల్యే ఆర్కే. దళిత రైతుల భూములను చంద్రబాబు తనవారికి కారుచౌకగా ఇప్పించారు. రాజధాని ప్రాంతంలో బినామీలుగా ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల చిట్టాను త్వరలో బయటపెడతాం-ఎమ్మెల్యే ఆర్కే.
- ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకల దగ్గర సముద్రంలో నలుగురు యువకుల గల్లంతు. ముగ్గురిని కాపాడిన మెరైన్ పోలీసులు. మరో యువకుడి కోసం కొనసాగుతున్న గాలింపు.
- యానాంలో ప్రేమజంట అనుమానాస్పద మృతి. మృతులు కాట్రేనిపాడుకు చెందిన రమేష్. మలికిపురం మండలానికి చెందిన యువతిగా గుర్తింపు. పెద్దలు పెళ్లికి అంగీకరించలేదని ఈ నెల 9న ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమజంట. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం. అదుపులోకి తీసుకుని విచారిస్తున్న కస్టమ్స్ అధికారులు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.5.46 కోట్లు ఉంటుందని అంచనా.
- అమరావతి: అసెంబ్లీకి వెళ్లకుండా మమ్మల్ని అడ్డుకున్నారు-చంద్రబాబు. అమాయకులపై ఎస్సీ, ఎస్టీ యాక్ట్ పెట్టి దాడులు చేస్తున్నారు. టీడీపీ హయాంలో ఇంగ్లీష్ మీడియాన్ని వైసీపీ నేతలు వ్యతిరేకించారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం తెచ్చి రెండు నాలుకలధోరణి అవలంబిస్తున్నారు కొత్త చీఫ్ మార్షల్ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు-చంద్రబాబు.
- గుంటూరు: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వైసీపీ నెరవేర్చలేదు. ఆర్టీసీ చార్జీలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచారు-యరపతినేని. ఉల్లి ధరలు ఆకాశాన్ని అంటాయి-మాజీ ఎమ్మెల్యే యరపతినేని. నియోజకవర్గ పరిధిలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. వైసీపీ కార్యకర్తలే ఇసుకను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు-మాజీ ఎమ్మెల్యే యరపతినేని.