మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల […]

మహారాష్ట్ర కూటమిలో బీటలు ? శరద్ పవార్ సీరియస్ !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2020 | 11:39 AM

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంలో మెల్లగా విభేదాల నీలినీడలు పరచుకుంటున్నాయి. శివసేన అధ్యక్షుడు, సీఎం ఉధ్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవర్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎల్గార్ పరిషద్ కేసును నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి అప్పగించాలని, ముస్లిములకు రిజర్వేషన్ కల్పించాలన్న ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఆయన.. వీటిపై చర్చించేందుకు ప్రభుత్వం లోని తమ పార్టీ మంత్రులతోను, పార్టీ నేతలతోనూ సోమవారం సమావేశమవుతున్నారు. శాంతి భద్రతల అంశం రాష్ట్ర పరిధిలోనిదని, ఒక రాష్ట్ర హక్కులను కేంద్ర పరిధిలోకి జొప్పించడం సరికాదని ఆయన భావిస్తున్నారు. అలాగే జాతీయ జనాభా గణన (ఎన్ పీ ఆర్) ప్రక్రియను మే 1 నుంచి అమలు చేయాలని  ఉధ్ధవ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎన్సీపీ వ్యతిరేకిస్తోంది. రాష్ట్రంలో శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీలతో కలిసి ‘మహా వికాస్ ఆఘాడీ’ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన శరద్ పవార్.. ఇలా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడాన్ని రాజకీయ పరిశీలకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. 75 రోజుల ఉధ్ధవ్ ప్రభుత్వానికి కాంగ్రెస్, ఎన్సీపీలు ‘దెబ్బ కొట్టే’ యత్నంలో ఉన్నాయా అని భావిస్తున్నారు. సీఏఏ, జాతీయ జనాభా గణన చట్టాలను ఈ రెండు పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా రెండో చట్టం అమలును ఆపివేయాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ గత జనవరిలోనే ఓ తీర్మానాన్ని ఆమోదించింది. ఎల్గార్ పరిషద్ కేసు 2017 నాటిది.. నాడు జనవరి 1 న భీమా-కోరేగావ్ కేసుతో ఇది ముడిపడి ఉంది. ఆ నాడు దళితులపై అగ్రవర్ణాల దాడులు, అనంతరం పౌర హక్కుల సంఘాల నేతల అరెస్టులు దేశంలో సంచలనం రేపాయి. వరవరరావు వంటి నేతలను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధం విధించారు.

మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..