హోదాపై మీరేం చేస్తారు..? జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ
ప్రత్యేక హోదాపై సీఎం జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తుందని నమ్మి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారన్నారు. టీడీపీ సరైన నియమాలు పాటించక విఫలమైందని.. కానీ వైసీపీ కేంద్రంతోనే తేల్చుకోవాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. దీనిపై సీఎం అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే.. అఖిల పక్ష బృందాన్ని ప్రధాని దగ్గరకు తీసుకువెళ్లి చర్చించాలన్నారు. హోదా కోసం […]
ప్రత్యేక హోదాపై సీఎం జగన్కు సీపీఐ నేత రామకృష్ణ లేఖ రాశారు. వైసీపీ ఏపీకి ప్రత్యేక హోదా తెస్తుందని నమ్మి 22 మంది ఎంపీలను ప్రజలు గెలిపించారన్నారు. టీడీపీ సరైన నియమాలు పాటించక విఫలమైందని.. కానీ వైసీపీ కేంద్రంతోనే తేల్చుకోవాలన్నారు. ఏపీకి హోదా ఇచ్చేది లేదని కేంద్రం తేల్చి చెప్పిన నేపథ్యంలో.. దీనిపై సీఎం అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే.. అఖిల పక్ష బృందాన్ని ప్రధాని దగ్గరకు తీసుకువెళ్లి చర్చించాలన్నారు. హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని లేఖలో స్పష్టం చేశారు సీపీఐ నేత రామకృష్ణ. హోదా కోసం మీతో మేము కూడా కలిసి వస్తామని పేర్కొన్నారు.
కాగా.. సోమవారం ఏపీ సహా ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని లోక్సభలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.