ప్రముఖ సీపీఐ నాయకుడు గుండా మల్లేశ్ మరిలేరు
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఇకలేరు. 75 ఏళ్ల మల్లేశ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మల్లేశ్ మృతిపట్ల సీపీఐ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. సంతాపం ప్రకటిస్తున్నారు. గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నారాయణగూడలోని మక్దూమ్ భవన్కు తరలించనున్నారు. అనంతరం మల్లేశ్ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు […]
సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్ ఇకలేరు. 75 ఏళ్ల మల్లేశ్ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ నిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గుండా మల్లేశ్ మృతిపట్ల సీపీఐ పార్టీ నాయకులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి.. సంతాపం ప్రకటిస్తున్నారు. గుండా మల్లేశ్ భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం నారాయణగూడలోని మక్దూమ్ భవన్కు తరలించనున్నారు. అనంతరం మల్లేశ్ భౌతికకాయాన్ని ఆయన సొంత ఊరు బెల్లంపల్లికి తరలిస్తారు. బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి మల్లేశ్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన పదునైన ప్రసంగాలతో ప్రజాసమస్యల్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలో గుండా మల్లేశ్ తనదైన పాత్ర పోషించడమేకాదు, తన ప్రత్యేకతను చాటుకునేవారు.