మధ్యప్రదేశ్ లో ‘కౌ కేబినెట్’, గోరరక్షణే ప్రధానాంశం, దేశంలో ఇదే మొదటిసారంటున్నసీఎం శివరాజ్ సింగ్ చౌహన్
మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ' కౌ కేబినెట్' పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ..
మధ్యప్రదేశ్ లో గోవుల సంరక్షణ కోసం సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా ‘ కౌ కేబినెట్’ పేరిట ఓ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. పశుసంవర్ధక శాఖ, అటవీ, పంచాయత్, గ్రామీణాభివృద్ది, హోమ్, రైతు సంక్షేమ శాఖలు ఇందులో భాగంగా ఉంటాయని ఆయన చెప్పారు. కేవలం గోవుల పరిరక్షణ కోసం ఓ కేబినెట్ ని ఏర్పాటు చేయడం దేశంలో ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ మంత్రివర్గ తొలి సమావేశం ఈ నెల 22 న జరుగుతుందన్నారు. ఇతర రాష్టాలు కూడా ఈ విధమైన స్పెషల్ కేబినెట్ ఏర్పాటు చేయగలవన్న ఆశా భావాన్ని ఆయన వ్యక్తం చేశారు.