ఏపీ: మూడో రోజు వ్యాక్సినేషన్కు రంగం సిద్దం.. రెండు రోజుల్లో ఎంత మంది వ్యాక్సిన్ వేయించుకున్నారంటే.!
Covid Vaccination Drive: ఏపీ వ్యాప్తంగా మూడో రోజు కరోనా వ్యాక్సినేషన్కు రంగం సిద్దమైంది. నేడు రాష్ట్రంలోని నిర్దేశిత సెంటర్లలో ఉదయం...
Covid Vaccination Drive: ఏపీ వ్యాప్తంగా మూడో రోజు కరోనా వ్యాక్సినేషన్కు రంగం సిద్దమైంది. నేడు రాష్ట్రంలోని నిర్దేశిత సెంటర్లలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. కోవిన్ యాప్ ద్వారా మెసేజ్ పొందినవారు.. నిర్ణీత సమయాల్లో నిర్దేశించిన సెంటర్లకు రావాలని అధికారులు తెలిపారు.
కాగా, గడిచిన రెండు రోజుల్లో మొత్తంగా 32,144 మంది టీకా వేయించుకోగా.. నిన్న ఒక్క రోజు 13,036 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేశారు. ఇక ఆదివారం అత్యధికంగా తూర్పుగోదావరిలో 1,959 మంది.. అత్యల్పంగా కృష్ణా జిల్లాలో 480 మంది టీకా వేయించుకున్నారు. అటు కృష్ణ, నెల్లూరు జిల్లాల్లో ఒక్కొక్కరు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత స్వల్ప అస్వస్థత గురై.. కాసేపటితర్వాత కోలుకున్నారు.
Also Read:
విశాఖ వాసులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ రైళ్ల వేళల్లో మార్పులు.. పూర్తి వివరాలివే.!
కుర్రాళ్లు దంచికొట్టారు.. టీమిండియా అదరగొట్టింది.. తొలి ఇన్నింగ్స్లో 336 ఆలౌట్..
ఫిబ్రవరి 15వ తేదీ నుంచి ఆ విద్యార్ధులకు కూడా క్లాసులు.? విద్యాశాఖ ప్రాధమిక నిర్ణయం.!