కోవిడ్ పాజిటివ్ విద్యార్ధి పరీక్ష రాయవచ్చు, సుప్రీంకోర్టు
కరోనా వైరస్ పాజిటివ్ కి గురైనట్టు భావిస్తున్న విద్యార్ధి పరీక్ష రాయవచ్చునని సుప్రీంకోర్టు ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో కామన్ లా అడ్మిషన్ టెస్టుకు హాజరు కాగోరిన విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది.
కరోనా వైరస్ పాజిటివ్ కి గురైనట్టు భావిస్తున్న విద్యార్ధి పరీక్ష రాయవచ్చునని సుప్రీంకోర్టు ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో కామన్ లా అడ్మిషన్ టెస్టుకు హాజరు కాగోరిన విద్యార్థికి కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే పరీక్ష రాసేందుకు తనను ఎక్కడ అనుమతించరోనని భయపడిన ఈ అభ్యర్థి సుప్రీంకోర్టుకెక్కాడు.అయితే ఆ అభ్యర్థి ఐసోలేషన్ రూమ్ లో కూర్చుని పరీక్ష రాయాలని, ఇందుకు ఎగ్జామినర్లు అనుమతించాలని కోర్టు సూచించింది. ఇతర అభ్యర్థుల విషయంలో తమ ఈ ఉత్తర్వులు వర్తించబోవని స్పష్టం చేసింది.