కరోనా రోగికి గుండెపోటు, అయినా నిలిచి గెలిచాడు
ఇటీవల ఓ 32 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి గుండెపోటుకు గురయ్యాడు. ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో నగరంలోని ఓ ఆసుపత్రిలో అతడికి యాంజియోప్లాస్టీ చేశారు.
ఇటీవల ఓ 32 ఏళ్ల కోవిడ్ -19 పాజిటివ్ రోగి గుండెపోటుకు గురయ్యాడు. ఊపిరితిత్తులు కూడా తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. దీంతో నగరంలోని ఓ ఆసుపత్రిలో అతడికి యాంజియోప్లాస్టీ చేశారు. దీంతో అతడు క్రమక్రమంగా కోలుకుంటున్నారు. మొదట జ్వరం, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో రోగి హార్ట్ స్ట్రోక్ కు గురయ్యాడు. యాంజియోగ్రామ్ చేయగా అతడికి రెండు రక్త నాళాలు పూర్తిగా బ్లాక్ అయినట్లు తేలింది. మూడవ రక్తనాళం 95% మూసుకుపోయింది. వీటికి తోడు అతడు కోవిడ్ సోకినట్టు తేలింది. రెండు లంగ్స్ కూడా పూర్తిగా పాడయినట్లు పరీక్షల ద్వారా డాక్టర్లు గుర్తించారు.
” ఈ కేసుకు సంబంధించి మా మొదటి అడుగు రోగి రక్తపోటును నిర్ధారించడం. అది స్థిరపడిన తర్వాతే తదుపరి చికిత్స ప్రారంభించాం.ఇంట్రా-ఆరోటిక్ బెలూన్ పంప్ ఉపయోగించి ప్రీ-ప్రొసీజర్, ఎలిక్టివ్ ఇంట్యూబేషన్ జరిపాం. ఆ తర్వాత డ్రగ్-ఎలుటింగ్ స్టీతో బహుళ-నాళాల పెర్క్యుటేనియస్ యాంజియోప్లాస్టీ చేశాం” అని మెడికోవర్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ అనిల్ తెలిపారు.
Also Read :
అలెర్ట్ : కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు పిడుగు హెచ్చరిక