అబుదాబి, షార్జా నుంచి వచ్చే ఎన్నారైలకు.. ఆ సర్టిఫికేట్ తప్పనిసరి!
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూఏఈ నుంచి ఇండియాకు తిరిగి వచ్చే ఎన్నారైలకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది.
కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఈ క్రమంలో యూఏఈ నుంచి ఇండియాకు తిరిగి వచ్చే ఎన్నారైలకు కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ తప్పనిసరి అని ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రకటించింది. ఆగస్టు 21 నుంచి ఈ నిబంధనను వర్తింప చేయనున్నట్లు పేర్కొంది. అబుధాబి నుంచి వచ్చే ప్రయాణీకులు జర్నీకి 96 గంటల ముందు తీసుకున్న పీసీఆర్ టెస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉండాలని, అదే షార్జా నుంచి వచ్చేవారు 48 గంటల ముందు టెస్టు చేయించుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ ఉండాలని స్పష్టం చేసింది.
కాగా.. దుబాయ్కి తిరిగి వెళ్లే వారు జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ అఫైర్స్(జీడీఆర్ఎఫ్ఏ) దుబాయ్ వెబ్సైట్లో ఎంట్రీ పర్మిట్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అంతేగాక ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబొరేటరీ నుంచి తీసుకున్న కోవిడ్ నెగెటివ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి అని తెలియజేసింది. దీంతో పాటు మొబైల్స్లో కోవిడ్-19 దుబాయ్ స్మార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని పేర్కొంది.
Read More: