బిగ్ బ్రేకింగ్: ఇంటర్ బోర్డులో కరోనా కలకలం..
తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం చెలరేగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్..
తెలంగాణ ఇంటర్ బోర్డులో కరోనా కలకలం చెలరేగింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకూ లాక్డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. ఇక పలువురు ప్రజాప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులపై కూడా ఈ వైరస్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది.
తాజాగా ఇంటర్ బోర్డులో ఆరుగురు సిబ్బందికి, 9 మంది కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. గతంలోనూ ఇంటర్ బోర్డులో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. తాజాగా 130 మంది సిబ్బందికి కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఇప్పటి వరకు 89 మంది ఫలితాలు వెల్లడించారు అధికారులు. ఇందులో భాగంగా ఆరుగురు బోర్డు సిబ్బందితో పాటు 9 మంది వాళ్ళ కుటుంబ సభ్యులకు కోవిడ్ పాజిటివ్ ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఇంటర్ బోర్డులో ఇప్పటి వరకు మొత్తం 21 మందికి కరోనా పాజిటివ్ సోకింది.
Read More:
ఆ షూటింగ్ చివరి రోజే మహేష్ని ప్రేమిస్తున్నానని అర్థమైంది..