సీఎం పేషీలో అధికారి సహా, ఐదుగురికి కరోనా

సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఏపీ సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. ముఖ్యమంత్రి పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

సీఎం పేషీలో అధికారి సహా, ఐదుగురికి కరోనా
Follow us

|

Updated on: Jun 06, 2020 | 4:45 PM

సచివాలయంలో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఏపీ సచివాలయంలో మరో ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్దారించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పేషీలో పనిచేసే అధికారికి చెందిన డ్రైవర్ సహా ఐదుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు మొత్తంగా ఏపీ సచివాలయంలో 10 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు.

సచివాలయంలో ఔట్‌సోర్సింగ్ ద్వారా కమాండ్ కంట్రోల్‌లో పనిచేసే ఓ ఉద్యోగికి, ప్రణాళిక విభాగం‌లో డ్రైవర్‌గా పనిచేస్తున్న వ్యక్తికి, పరిశ్రమల శాఖలో పనిచేసే మరో ఉద్యోగి, సీఎం బ్లాక్‌లో ఆర్‌టీజీఎ‌స్‌లో పనిచేసే సర్వీస్ ప్రొవైడర్‌కు, సీఎం పేషీలో పనిచేసే అధికారి డ్రైవర్‌కు, ఉన్నత విద్యాశాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు కరోనా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సుల్లో వచ్చిన ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆ ఉద్యోగి వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నట్లుగా గుర్తించారు. ఉద్యోగితో కలిసి తిరిగిన వారంతా, సికింద్రాబాద్ బస్‌లో వచ్చిన ఉద్యోగులంతా సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సచివాలయంలోని 3, 4 బ్లాకుల్లో పనిచేసే ఉద్యోగులు కార్యాలయాలకు రావొద్దని ఉద్యోగుల సంఘం సూచనలు చేసింది. సచివాలయాన్ని శానిటైజ్ చేస్తున్నారు. సీఎం పేషీలో పలువురికి కరోనా సోకడం కలవరపెడుతోంది.