కరోనాపై యుద్ధం.. సచిన్ భారీ విరాళం..
COVID 19: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో పలువురు ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరూ తమ వంతు సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అందించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కరోనా నివారణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ సహాయనిధికి రూ.25 లక్షలు.. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు వెరిసి మొత్తంగా రూ. 50 […]
COVID 19: కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న పోరాటంలో పలువురు ప్రముఖులు కూడా మేము సైతం అంటూ ముందుకు వచ్చారు. ఇప్పటికే టాలీవుడ్ హీరోలందరూ తమ వంతు సాయాన్ని రెండు తెలుగు రాష్ట్రాలకు అందించిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు కరోనా నివారణకు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారీ విరాళాన్ని ప్రకటించారు. ప్రధాని నరేంద్రమోదీ సహాయనిధికి రూ.25 లక్షలు.. మహారాష్ట్ర సీఎం సహాయనిధికి రూ. 25 లక్షలు వెరిసి మొత్తంగా రూ. 50 లక్షల విరాళం ప్రకటించారు. మరోవైపు మాజీ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా కూడా తన మూడు నెలల జీతంతో పాటు బీసీసీఐ పించన్ను విరాళంగా ప్రకటించారు. అటు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ కూడా రూ. 21 లక్షల మొత్తాన్ని ప్రధాని సహాయనిధికి, అలాగే గుజరాత్ సీఎం సహాయనిధికి రూ. 21 లక్షలు అందజేసింది.
For More News:
తెలంగాణలో రాత్రి కర్ఫ్యూ పొడిగింపు..?
కరోనా కల్లోలం.. చైనాను దాటేసిన అమెరికా…
కరోనా ఎఫెక్ట్.. ఏపీలో ఏ టైంకు ఏవి దొరుకుతాయి..?
కరోనా వైరస్ గురించి పాప్ స్టార్ ముందే ఊహించారట.?
కరోనా విలయం.. స్విట్జర్లాండ్కు ఫెదరర్ భారీ సాయం…
దోమకాటుతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందా..?
Breaking: ఆర్బీఐ కీలక ప్రకటన.. రుణ చెల్లింపుదారులకు ఊరట..
రాజమండ్రిలో కలకలం.. దంపతుల ఆత్మహత్య..