హజూర్ సాహిత్ గురుద్వారా క్లోజ్.. రీజన్ ఇదే..!
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్నహజూర్ సాహిబ్ గురుద్వారాను మూసివేశారు. ఈ గురుద్వారాను సందర్శించుకుని పంజాబ్ చేరుకున్న వారిలో 91 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరికి కరోనా టెస్టులు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపారు. దీంతో శుక్రవారం గురుద్వారాను మూసివేశారు. అయితే పంజాబ్లో ఇప్పటి వరకు మొత్తం 585 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 20 మంది కరోనాబారినపడి చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకొని 108 మంది […]
సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం మహారాష్ట్రలోని నాందేడ్లో ఉన్నహజూర్ సాహిబ్ గురుద్వారాను మూసివేశారు. ఈ గురుద్వారాను సందర్శించుకుని పంజాబ్ చేరుకున్న వారిలో 91 మందికి కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. వీరికి కరోనా టెస్టులు చేయగా.. రిపోర్టులో పాజిటివ్ అని వచ్చినట్లు తెలిపారు. దీంతో శుక్రవారం గురుద్వారాను మూసివేశారు. అయితే పంజాబ్లో ఇప్పటి వరకు మొత్తం 585 కేసులు నమోదయ్యాయి. వీరిలో ఇప్పటి వరకు 20 మంది కరోనాబారినపడి చనిపోయారు. ఇక కరోనా నుంచి కోలుకొని 108 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 457 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక హర్యానాలో కూడా నాందేడ్ వెళ్లి వచ్చిన 18 మంది భక్తులు క్వారంటైన్లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. దేశ వ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో.. పంజాబ్ రాష్ట్రానికి చెందిన దాదాపు 4 వేల మంది సిక్కు భక్తులు నాందేడ్లోని హజూర్ సాహిబ్ గురుద్వారాలో చిక్కుకుపోయారు.