Covid 19: కరోనాను నియంత్రించడానికి.. ఆయుష్ మెడిసిన్..!
కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వైరస్ రాకుండా ముందు
Covid 19: కరోనావైరస్ కల్లోలానికి ప్రపంచం వణికిపోతోంది. ఇప్పుడు ఇండియాలోను ఈ వైరస్ ప్రవేశించి భయపెడుతున్నది. అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీంతో వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయుష్ విభాగం ఔషధాలను సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గనిర్దేశం ప్రకారం హోమియోపతి మందులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కాగా.. ఈ హోమియోపతి మందులను ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మందులను మూడు రోజుల పాటు రోజుకు ఆరు చొప్పున వేసుకోవాలి. ఏడాది లోపు చిన్నారులకు రోజుకు మూడు చొప్పున తల్లిపాలలో కలిపి ఇవ్వాల్సి ఉంటుందని ఆయుష్ వైద్యులు తెలిపారు.