స్టేడియంలో 5వేల మందికి అనుమతి..
కొవిడ్-19 ప్రభావంతో లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 ఆంక్షలను తొలిగిస్తున్నాయి. స్టేడియంలో పరిమితితో కూడిన ఆటలకు అనుమతులు ఇస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్రీడా కార్యక్రమాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆస్ట్రేలియా బాటలో ఫ్రాన్స్ పయనిస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియంలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. […]
కొవిడ్-19 ప్రభావంతో లాక్ డౌన్ లోకి వెళ్లి పోయిన ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడు నెమ్మదిగా బయట పడుతున్నాయి. కొన్ని దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా తగ్గుముఖం పట్టడంతో కొవిడ్-19 ఆంక్షలను తొలిగిస్తున్నాయి. స్టేడియంలో పరిమితితో కూడిన ఆటలకు అనుమతులు ఇస్తున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ క్రీడా కార్యక్రమాల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
తాజాగా ఆస్ట్రేలియా బాటలో ఫ్రాన్స్ పయనిస్తోంది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్లు, స్టేడియంలు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. 40 వేల ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న స్టేడియాల్లోకి.. 15శాతం వంతు జనాలను అమనుతి ఇచ్చింది. అంటే అలాంటి స్టేడియాల్లో 5 వేల మంది ప్రేక్షకులకు ఎంట్రీ దక్కే ఛాన్సు ఉంటుంది. స్టేడియంలో ప్రేక్షకుల మధ్య 2.5 మీటర్ల దూరాన్ని మెయింటేన్ చేస్తే, ఇది వీలు అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొవిడ్-19 నియంత్రణలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఇక ఇండోర్లో జరిగే వేడుకలకు.. వంద మంది మాత్రమే హాజరుకావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.