శ్రీశైలం దేవస్థానంపై కరోనా ప్రభావం.. లాక్డౌన్ ఎన్ని రోజులంటే…
Covid-19 Effect on Srisailam Temple : శ్రీశైలం దేవస్థానంపై కొవిడ్ వైరస్ ప్రభావం పడింది. కరోనా ప్రభావంతో ఉద్యోగులు, అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో కొంత మంది ఉద్యోగులతోపాటు పనిచేసేవారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆలయంలో భక్తులు లేకుండా యధావిధిగా నిత్యకైంకర్యాలు పూజలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. శ్రీశైలంలో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో […]
Covid-19 Effect on Srisailam Temple : శ్రీశైలం దేవస్థానంపై కొవిడ్ వైరస్ ప్రభావం పడింది. కరోనా ప్రభావంతో ఉద్యోగులు, అధికారులు అత్యవసర సమావేశం నిర్వహించారు. శ్రీశైలంలో కొంత మంది ఉద్యోగులతోపాటు పనిచేసేవారికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయంలో భక్తులు లేకుండా యధావిధిగా నిత్యకైంకర్యాలు పూజలు, పరోక్ష సేవలను కొనసాగిస్తామని ఈవో కేఎస్ రామారావు తెలిపారు. శ్రీశైలంలో కరోనా పాజిటివ్ కేసులు ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో స్వామిఅమ్మవార్ల దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేసినట్లు పేర్కొన్నారు. వారం రోజులపాటు శ్రీశైలం ఆలయం పరిసర ప్రాంతాల్లో దేవాదాయశాఖ అధికారులు లాక్ డౌన్ ప్రకటించారు.