బ్రేకింగ్.. కరోనాకు పతంజలి చెక్… నాలుగైదు రోజుల్లో నిరూపిస్తానన్న సీఈఓ..
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు మందు ఆయుర్వేదమేనంటూ పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి విరుగుడు మందు ఆయుర్వేదమేనంటూ పతంజలి సీఈఓ ఆచార్య బాలకృష్ణ స్పష్టం చేశారు. తాము కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఓ ప్ర్తత్యేక శాస్త్రవేత్తల బృంధాన్ని నియమించామని.. వారు నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని తెలిపారు. తాము కొంత మంది కరోనా సోకిన పేషేంట్లపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించామని.. ఈ ట్రయల్స్లో వందకు వంద శాతం సత్ఫలితాలనిచ్చాయని.. తాము ఇచ్చిన మెడిసిన్ తీసుకున్న అనంతరం.. కరోనా రోగులు 5-14 రోజుల వ్యవధిలోనే కోలుకున్నారని తెలిపారు. ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ కరోనా మహమ్మారికి ఆయుర్వేదం ద్వారా ఖచ్చితంగా చెక్ పెట్టవచ్చని తాము ఆధారాలతో సహా ముందు ఉంచుతామని తెలిపారు. మరో నాలుగైదు రోజుల్లో.. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలను, దీనికి సంబంధించిన సమాచారాన్ని విడుదల చేస్తామని పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.
#WATCH We appointed a team of scientists after #COVID19 outbreak. Firstly, simulation was done&compounds were identified which can fight the virus. Then, we conducted clinical case study on many positive patients&we’ve got 100% favourable results: Acharya Balkrishna,CEO Patanjali pic.twitter.com/3kiZB6Nk2o
— ANI (@ANI) June 13, 2020