కరోనా అప్డేట్: దేశంలో 694 కేసులు, 16 మరణాలు..
COVID 19: కరోనా రాకాసి భారత్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. గురవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 694కి చేరుకుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మొత్తంగా 16 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 45 మంది కోలుకున్నారు. ఇక మహరాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రలో అత్యధికంగా 124 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ […]
COVID 19: కరోనా రాకాసి భారత్లో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దేశంలో 27 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఈ వైరస్ పాకింది. గురవారం నాటికి దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 694కి చేరుకుంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు మొత్తంగా 16 మంది మృత్యువాతపడ్డారు. మొత్తం బాధితుల్లో 45 మంది కోలుకున్నారు. ఇక మహరాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో ఈ వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. అంతేకాకుండా మహారాష్ట్రలో అత్యధికంగా 124 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇకకేరళలో 118కేసులు ఉన్నాయి. కాగా, రాత్రి 8 గంటల వరకు దేశవ్యాప్తంగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
ఈ మహమ్మారి కోవిడ్ 19ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాయి. ఇప్పటికే దేశమంతా లాక్ డౌన్ ప్రకటించగా.. ప్రజలు తమ ఇళ్లు దాటి బయటికి రావద్దని ప్రభుత్వాలు విజ్ఞప్తి చేశాయి. అత్యవసర సేవలు మినహాయించి ప్రజా రవాణా మొత్తం ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు బంద్ అయ్యాయి.
For More News:
దేశంలో మొట్టమొదటి కోవిడ్ 19 ఆసుపత్రి.. రిలయన్స్ సంచలనం..
గుడ్ న్యూస్.. కరోనాలా హంటా వైరస్ కాదట… అసలు నిజమిదే.!
కరోనా ఎఫెక్ట్.. దేశవ్యాప్తంగా టోల్ గేట్ ఫీజులు రద్దు..
కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు ఫిక్స్.. ధరలు పెంచితే కేసులు తప్పవు..
సామాజిక దూరం పాటిస్తే.. ఇండియాలో కరోనా కేసులు 62 శాతం తగ్గుతాయట..!
కరోనా మృత్యుకేళి.. 22 వేలు దాటిన మరణాలు.. ఒక్కరోజే @748
హైదరాబాద్ హాస్టళ్లలో ఉండే ఉద్యోగులు, విద్యార్థులకు ఊరట…
Breaking.. కరోనా ఎఫెక్ట్.. ఏప్రిల్ 14 వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దు..