కరోనా వైరస్.. ఆమీర్పేట్లోని హాస్టళ్లు, కోచింగ్ సెంటర్ల మూసివేత…
COVID 19: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న దాదాపు 850 హాస్టళ్లను, ఐటీ కోచింగ్ సెంటర్లను కూడా నెలాఖరు దాకా మూసి వేయాల్సిందేనని జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించారు. […]
COVID 19: కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విద్యాసంస్థలు, కాలేజీలు, థియేటర్లను ఈ నెల 31 వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ పరిధిలో ఉన్న దాదాపు 850 హాస్టళ్లను, ఐటీ కోచింగ్ సెంటర్లను కూడా నెలాఖరు దాకా మూసి వేయాల్సిందేనని జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ గీతా రాధిక ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హాస్టల్ నిర్వాహకులతో భేటీ అయిన కార్పొరేటర్ శేషుకుమారి, డీసీ గీతారాధిక, ఇతర పోలీసు సిబ్బంది.. ఇవాళ సాయంత్రంలోగా హాస్టళ్లను మూసివేసి విద్యార్థులను స్వస్థలాలకు పంపించాల్సిందిగా సూచించారు.
జీహెచ్ఎంసీ ఉత్తర్వులు ఉల్లఘించి ఎవరైనా నిర్వాహకులు కోచింగ్ సెంటర్లు, వసతి గృహాలను నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాగా, ఇలా సడన్గా హాస్టళ్లను ఖాళీ చేయాలని ఉత్తర్వులు జారీ చేయడంతో తమ పరిస్థితి ఏంటని వేల మంది విద్యార్థులు, ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
For More News:
హైదరాబాద్లో పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్…
రేపిస్టు భార్యగా ఉండలేను.. విడాకులు కావాలి..
ఐపీఎల్కు ఆస్ట్రేలియా ఆటగాళ్లు దూరం..!
కరోనా ప్రభావం.. ఐదు లక్షల రెస్టారెంట్లు బంద్…
ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కోర్సు ఫీజుల ఖరారు.!
కరోనా వైరస్.. చైనా సరిహద్దు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువేనట..!