ఏపీలో కరోనా డేంజర్ బెల్స్..98 మందికి పాజిటివ్..71కి చేరిన మరణాలు
ఆంధ్రప్రదేశ్ను కోవిడ్ భూతం వెంటాడుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్, వలస కూలీలతో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్ను పరీక్షించగా...
ఆంధ్రప్రదేశ్ను కోవిడ్ భూతం వెంటాడుతోంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో 98 కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి వచ్చిన వారు, లోకల్ కాంటాక్ట్, వలస కూలీలతో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,986 శాంపిల్స్ను పరీక్షించగా 98 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3,377కి చేరింది. మరో 29మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య 1,033 కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,273 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ముగ్గురు మరణించగా, మొత్తం మరణాల సంఖ్య 71కి చేరింది. ఇవాళ నమోదైన పాజిటివ్ కేసుల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 43మందికి కరోనా నిర్థారణ అయ్యింది.