కరోనాతో ’అనంత‘ విలయం..8 మంది జర్నలిస్టులకు పాజిటివ్
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజల్ని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ.. పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు..
ఆంధ్రప్రదేశ్లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్ర ప్రజల్ని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ.. పరిస్థితి ఏమాత్రం మారడం లేదు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు చాలా మంది వైరస్ బారినపడుతుండగా, మీడియా సిబ్బందికి కూడా చాలా మందికి కోవిడ్ సోకినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లాలో ఎనిమిది మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. కరోనా సోకిన జర్నలిస్టులను తక్షణమే ఆదుకోవాలని ఏపీ డబ్ల్యూజే డిమాండ్ చేసింది. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు మెరుగైన వైద్య సాయం అందించడమే కాకుండా, వారందరికీ వెంటనే రూ.20వేలు ఆర్థిక సాయం అందించాలని కోరింది. ఈ మేరకు జర్నలిస్టు సంఘం నాయకులు మంత్రి శంకరనారాయణ, ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి వినతి పత్రం అందించారు. జర్నలిస్టు సంఘం నేతల వినతికి వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, ఏపీలో కొత్తగా గురువారం(జూలై2న) 845 కరోనా కేసులు నమోదయ్యాయి.14,285 మందికి పరీక్షలు నిర్వహించగా 845 మందికి కరోనా నిర్ధారణ అయింది. వైరస్ కారణంగా మరో ఐదుగురు మృత్యువాతపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 16,097కు చేరింది. రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 198కి చేరింది.