53 మంది జర్నలిస్టులకు కరోనా
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోరలు చాస్తూ బుసలు కొడుతున్న కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా అది ప్రతాపం చూపెడుతోంది. ప్రమాదకర వైరస్ ..
దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కోరలు చాస్తూ బుసలు కొడుతున్న కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఎన్ని చర్యలు చేపట్టినా అది ప్రతాపం చూపెడుతోంది. ప్రమాదకర వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. ముంబైలో 53 మంది జర్నలిస్టులకు కరోనా సోకింది. బీఎంసీ నిర్వహించిన కరోనా పరీక్షల్లోఈ విషయం వెలుగులోనికి వచ్చింది. మొత్తం 170 మంది జర్నలిస్టులు, ఫొటో గ్రాఫర్లకు కరోనా టెస్టులు చేస్తే వారిలో 53 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. టెస్టులు చేయడానికి ముందు వీరెవరికీ కరోనా లక్షణాలు లేకపోవడం గమనార్హం.
ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్నప్రమాదకర కోవిడ్ వైరస్ కారణంగా మహారాష్ట్ర అల్లాడుతోంది. ఆదివారం ఒక్కరోజే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 552 వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. దీంతో మహారాష్ట్రలో పాజిటివ్ కేసుల సంఖ్య 4200 చేరింది. కోవిడ్ బారిన పడి ఇప్పటి వరకు 223 మంది మరణించారు. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 3,470గా ఉంది. ఆదివారం 142 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 507కు చేరింది. మహారాష్ట్రలో అత్యధికంగా రాజధాని ముంబైలో వైరస్ ప్రభావం అధికంగా ఉంది. ఇప్పటివరకు రెండు వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.