ఆ అపార్ట్మెంట్లో బర్త్డే పార్టీ..28మందికి కరోనా !
నగరంలో ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్డే పార్టీతో ఏకంగా 23 మందిలో కరోనా లక్షణాలు బయటపడటం కలకలం రేపుతోంది.
తెలంగాణ జిల్లాల్లో తగ్గిన కరోనా వ్యాప్తి..హైదరాబాద్ను వెంటాడుతోంది. రోజుకో ప్రాంతంలో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. పానీ పూరి అమ్మేవాళ్ల నుంచి పల్లీలు అమ్ముకునే వాళ్లు, ఛాయ్ బండీ వాళ్లు ఇలా ఎవరో ఒకరి నుంచి పెద్ద సంఖ్యల వైరస్ వ్యాప్తి చెందుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే వలస కూలీలతో వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, తాజాగా నగరంలో ఓ అపార్ట్మెంట్లో జరిగిన బర్త్డే పార్టీతో ఏకంగా 23 మందిలో కరోనా లక్షణాలు బయటపడటం కలకలం రేపుతోంది.
కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించేందుకు భౌతిక దూరం పాటించాలంటూ ఇటు ప్రభుత్వం అధికారులు నెత్తినోరూ భాదుకుని చెబుతున్నారు. అయినప్పటికీ కొందరు నిబంధనలను ఏమాత్రం పట్టించుకోవటం లేదు..నగరంలోని సంతోష్ నగర్ మాదన్నపేటలోని ఓ అపార్ట్మెంట్లో ఇటీవల ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న వారు భౌతిక దూరాన్ని విస్మరించి ఎంజాయ్ చేశారు. దీంతో ఈ అపార్ట్మెంట్లో నివసిస్తున్న 23 మందికి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. బర్త్డే పార్టీకి వచ్చిన మరో ఐదుగురిలో కూడా కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడినట్లు జీహెచ్ ఎంసీ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ ఏరియాను కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు.