20 కత్తిపోట్లు తిని కూడా.. దోపిడీ దొంగలతో ఫైట్..!
దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట చిక్మంగళూరుకు వెళ్తోంది. హైవేపై ఉండగా కొందరు దోపిడీ దొంగలు
Couple fights off muggers: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటకకు చెందిన ఓ టెకీ జంట చిక్మంగళూరుకు వెళ్తోంది. హైవేపై ఉండగా కొందరు దోపిడీ దొంగలు ఓ జంటను దోచుకోవడం వారి కంటబడింది. వాళ్లకు సాయం చేద్దామని కేకలు వేసిందా జంట. అంతే బైకులపై వెంటనే వారి కారును అడ్డగించిన దొంగలు.. కత్తితో కారులోని టెకీపై దాడి చేశారు.
ఈ సంఘటనలో అతని చేతులమీదా, మొహం మీదా దాదాపు 20పైగా కత్తిపోట్లు పడ్డాయి. ఆ సమయంలో అతని పక్కనే కూర్చొని ఉన్న భార్య.. ఎక్సిలేటర్ను బలంగా అదిమి కారు ఎదురుగా ఉన్న దొంగల బైకులను ఢీ కొట్టింది. దీంతో భయపడిపోయిన దొంగలు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ఇన్స్టాగ్రామ్ రీల్స్: రీలింగ్ చేస్తున్న పలువురు సెలెబ్రిటీలు