లాక్ డౌన్తో ఇంట్లో బోర్ కొడుతోందని యువతి ఆత్మహత్య
లాక్ డౌన్తో ఇంట్లో ఉండి బోర్ కొడుతోందని యువతి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. యువతి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో..
లాక్ డౌన్తో ఇంట్లో ఉండి బోర్ కొడుతోందని యువతి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం కలకలం రేకెత్తిస్తోంది. ఈ ఘటన చిత్తూరు జిల్లా కలకడ మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో జరిగింది. యువతి విజయవాడలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నీట్ కోచింగ్ తీసుకుంటోంది. లాక్డౌన్ అమలు చేయడంతో ఏప్రిల్ 3వ తేదీ ఇంటికి వెళ్లింది రంజిత. కోచింగ్ సెంటర్లో పరిచయమైన స్నేహితులతో రోజూ గంటల కొద్దీ మాట్లాడేది. అయితే మంగళవారం ఫ్రెండ్స్ ఎవరూ ఫోన్ మాట్లాడటానికి అందుబాటులో లేకపోవడంతో.. మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నెలరోజుల నుంచి ఇంట్లోనే కూర్చుని ఉండలేకపోతున్నానని లాక్ డౌన్ ఎత్తేస్తే కాలేజీకి వెళ్లిపోతానని ఇరుగు పొరుగు వారి దగ్గర అనేకసార్లు ప్రస్తావించింది రంజిత.
Read More:
తెలుగు సినిమాల గురించి ప్రత్యేకంగా భారత్ క్రికెటర్ల చర్చ
బ్రేకింగ్: గాంధీ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీకి గ్రీన్ సిగ్నల్
భారత్లో వెయ్యి దాటిన మృతుల సంఖ్య.. 31 వేలకు కరోనా పాజిటివ్ కేసులు