దేశవ్యాప్తంగా తిరిగి ప్రారంభమైన ఆధార్ సేవలు
14 వేల ఆధార్ కేంద్రాలు తెరిచినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ నిర్వహించే.. 14 వేల ఆధార్ కేంద్రాలు తెరిచే ఉన్నట్టు తెలిపింది. అలాగే యూఐడీఏఐ స్వయంగా నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రాలు..
Aadhaar card: కరోనా వైరస్ కారణంగా కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే కదా. దీంతో దేశ వ్యాప్తంగా అన్ని ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. అయితే కేంద్రం తీసుకొచ్చిన సడలింపుల్లో భాగంగా.. మార్చి 25వ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పలు కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఆధార్ సేవలను కూడా ప్రారంభిస్తున్నట్లు యూఐడీఏఐ(UIDAI) ట్వీట్ ద్వారా పేర్కొంది. దాదాపు 14 వేల ఆధార్ కేంద్రాలు తెరిచినట్లు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ నిర్వహించే.. 14 వేల ఆధార్ కేంద్రాలు తెరిచే ఉన్నట్టు తెలిపింది. అలాగే యూఐడీఏఐ స్వయంగా నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రాలు కూడా తెరుచుకున్నాయి.
దేశ వ్యాప్తంగానే కాకుండా తెలుగు రాష్ట్రాలోనూ ఆధార్ సేవా కేంద్రాలను తెరుస్తున్నట్లు UIDAI పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల UIDAI ఆధార్ సేవా కేంద్రాలున్నాయి. తెలంగాణలో హైదరాబాద్లోని మాదాపూర్, వరంగల్లోని నయీంనగర్, ఏపీలో విజయవాడలో లబ్బీపేట, విశాఖపట్నంలోని ద్వారకానగర్లో యూఐడీఏఐ ఆధార్ సేవాల కేంద్రాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కాగా మిగిలిన ప్రాంతాల్లో ఆధార్ కేంద్రాలను తెరిపించేందుకు స్థానిక ప్రభుత్వాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు యూఐడీఐ పేర్కొంది.
IMPORTANT ANNOUNCEMENT: As on date, over 14,000 #AadhaarKendra run by state govts, post offices, banks, BSNL are operational across the country (details: https://t.co/oCJ66DD0fK) We’re in touch with local administrations for permission to restart operations at other centres ASAP.
— Aadhaar (@UIDAI) June 4, 2020
Read More:
తెలంగాణ హోం క్వారంటైన్ న్యూ గైడ్లైన్స్.. ఇంట్లో ఇలా ఉండాలి..