యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా.. ఇప్పటివరకు 20 మందికి కరోనా పాజిటివ్
కరోనా మహమ్మారి మరో సారి పంజా విసురుతుంది. కరోనా కొత్త అవతారం స్ట్రెయిన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారికోసం
కరోనా మహమ్మారి మరోసారి పంజా విసురుతుంది. కరోనా కొత్త అవతారం స్ట్రెయిన్ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటికే యూకే నుంచి వచ్చిన వారికోసం గాలిస్తున్నారు అధికారులు. తాజాగా యూకే నుంచి వచ్చిన వారిలో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇద్దరికి కరోనా పాజిటివ్ గా తేలిందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 20 మందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. డిసెంబర్ 9 నుంచి ఇప్పటి వరకు యూకే నుంచి 1,216 మంది వచ్చారు. వీరిలో 970 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్కు వచ్చి స్వరాష్ట్రాలకు వెళ్లిన వారిని ప్రభుత్వం గుర్తిస్తుంది. యూకే ప్రయాణీకుల గురించి ఆయా రాష్ట్రాలకు ప్రభుత్వం సమాచారం అందించింది. ఇంకా 154 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది.