Covid 19 cases : తెలంగాణలో కొత్తగా 143 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ.. ఒకరు మృతి
తెలంగాణలో కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 143 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,96,277 కి చేరుకుంది.
Telangana Coronavirus Cases : తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతూనే ఉంది. రాష్ట్రవ్యాప్తంగా గురువారం రాత్రి 8గంటల నుంచి శుక్రవారం రాత్రి 8గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల్లో కొత్తగా 143 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,96,277 కి చేరుకుంది. ఈమేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,614కి చేరింది. కరోనా బారి పడి శుక్రవారం 152 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో తెలంగాణలో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,92,848కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,815 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 838 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.