TS Covid-19: తెలంగాణ కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 315మందికి పాజిటివ్, మరో ఇద్దరు మృతి

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటితో పోల్చితే కోవిడ్ పాజిటివ్ కేసులు కాస్త తగ్గినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

TS Covid-19: తెలంగాణ కరోనా కేసుల్లో హెచ్చు తగ్గులు.. కొత్తగా 315మందికి పాజిటివ్, మరో ఇద్దరు మృతి
Coronavirus
Follow us

|

Updated on: Sep 09, 2021 | 8:27 PM

Telangana Coronavirus Cases: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటున్నాయి. నిన్నటితో పోల్చితే కోవిడ్ పాజిటివ్ కేసులు కాస్త తగ్గినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 315 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 6,60,786కు చేరుకుంది. ఇక, గడిచిన 24గంటల వ్యవధిలో 340 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అవగా.. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 6,51,425 మంది బాధితులు కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, కొత్తగా మరో ఇద్దరు కరోనా మహమ్మారి ధాటికి మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,891కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,490 యాక్టివ్‌ కేసులున్నాయి. రికవరీ రేటు 98.58శాతం, మరణాల రేటు 0.58 శాతం ఉందని వైద్య, ఆరోగ్యశాఖ గురువారం తెలిపింది. ఇవాళ ఒకే రోజు 75,199 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 83, హన్మకొండ జిల్లాలో 21, నల్లగొండ జిల్లాలో 21, కరీంనగర్‌ జిల్లాలో 20 మందికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

ఇక, జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి…

Telangana Coronavirus Cases

Telangana Coronavirus Cases

Read Also…  నడి రోడ్డుపై బాలుడి తల.. రంగంలోకి దిగిన రెండు ప్రత్యేక పోలీసు బృందాలు.. మృతదేహం కోసం గాలింపు..!