Shaik Madar Saheb |
Updated on: Jun 19, 2021 | 1:39 PM
Sumati Nayak: దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా విజృంభించి ఇప్పడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కేసుల కన్నా.. రోజురోజుకు కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో దేశంలో భయాందోళనలు ఇప్పుడిప్పడే తొలుగుతున్నాయి. పలువురు వృద్ధులు కూడా కరోనాను జయిస్తూ అందరిలో ఆత్మస్థైర్యం నెలకొల్పుతున్నారు.
తాజాగా ఒడిశా రాష్ట్రంలో కరోనా నుంచి శతాధిక వృద్ధురాలు కోలుకొని చాలామందిలో ధైర్యాన్ని నింపింది. అసలు బతకదు అనుకున్న వారే.. ఆమె పోరాడిన తీరు చూసి నోరెళ్లబెడుతున్నారు. ఆమె ముందు కరోనానే ఓడిపోయిందంటూ పేర్కొంటున్నారు.
నాయగర్ జిల్లాలోని ఖండపాడ ప్రాంతానికి చెందిన శాతాధిక వృద్ధురాలు సుమతి నాయక్ కరోనా మహమ్మారిని జయించింది. ఆమె కోలుకునేంత వరకూ వైద్యులు, నర్సులు అందరూ బాగా చూసుకున్నారు. నిరంతరం ఆమెను పర్యవేక్షిస్తూ మందులు అందించారు.
ఆమె జూన్ 16 న ఆమె కరోనా నుంచి ఆరోగ్యంగా కోలుకుంది. దీంతో ఆమెను ఆమె ఇంటికి పంపించినట్లు జిల్లా కలెక్టర్ పోమా టుడు తెలిపారు. శాతాధిక వృద్ధురాలు కోలుకోని కరోనా బాధితులకు ధైర్యాన్ని నింపిందంటూ కొనియాడారు.
India Corona Updates