ఇదే స్ఫూర్తితో లాక్ డౌన్ కొనసాగించాలి : కేసీఆర్

కరోనా వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రికేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న […]

ఇదే స్ఫూర్తితో లాక్ డౌన్ కొనసాగించాలి : కేసీఆర్
Follow us

|

Updated on: Apr 11, 2020 | 6:58 AM

కరోనా వ్యాప్తి నియంత్రణకు అమలు చేస్తున్న లాక్ డౌన్ ను ఇదే స్ఫూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రికేసీఆర్‌ రాష్ట్ర ప్రజలను కోరారు. కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించి చికిత్స అందించడం, వారు కలిసిన వారిని గుర్తించి క్వారంటైన్ చేయడం క్రమం తప్పకుండా చేస్తున్నామని వెల్లడించారు. లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ నిత్యావసరాలకు కొరత రాకుండా చూడాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. వరికోతలు, ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లు యథావిధిగా జరపాలని చెప్పారు. కరోనా వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స, లాక్ డౌన్ అమలు, వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు.

వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్.నర్సింగ్ రావు, రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.కరోనా వైరస్ లక్షణాలున్న వారికి పరీక్షలు జరుపుతున్నామని, శుక్రవారం కొత్తగా 16 మందికి పాజిటివ్ వచ్చిందని, వారికి చికిత్స అందిస్తున్నామని ఈ సంద‌ర్భంగా అధికారులు ముఖ్య‌మంత్రికి తెలిపారు. వారి కుటుంబసభ్యులు, వారు కలిసిన వారిని కూడా గుర్తించి క్వారంటైన్ చేసినట్లు చెప్పారు. పాజిటివ్ కేసులు ఎక్కువయినప్పటికీ అందరికీ చికిత్స చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వారు వివ‌రించారు. ఇవాళ ప్ర‌ధాని మోదీతో జరిగే వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించాల్సిన అంశాలు, మధ్యాహ్నం మంత్రివర్గ సమావేశంలో చర్చకు పెట్టాల్సిన అంశాలపై కూడా సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలకు, అధికారులకు పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు చేశారు. లాక్‌డౌన్‌ ను కట్టుదిట్టంగా అమలు చేయాలి. దేశంలో, రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కావడం వల్లనే వైరస్ ఇతర దేశాల మాదిరిగా ఎక్కువగా విస్తరించడం లేదు. ఈ సత్యాన్ని గ్రహించి ప్రజలు సహకరించాలన్నారు. లాక్‌డౌన్‌ సందర్భంగా నిత్యావసర సరుకుల కొరత లేకుండా చూడాలనీ, పాలు, పండ్లు, కూరగాయలు, మందులు, మాంసం తదితర విక్రయాలు యథావిధిగా జరిగే విధంగా చూడాలని కోరారు. ఈ షాపుల వద్ద జనం గుమిగూడ కుండా సామాజిక దూరం పాటించాలని సూచించారు. రేషన్ షాపుల ద్వారా నియంత్రిత పద్ధతిలో జరుగుతున్న ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలనీ, చెప్పిన సమయానికి వచ్చి, సామాజిక దూరం పాటించి బియ్యం పొందాలని సూచించారు.