కేంద్రం మరో గుడ్న్యూస్..మహిళలకు రూ.10 లక్షల రుణం.. ఇవే అర్హతలు..
ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్ ద్వారా ఈ లోన్స్ పొందొచ్చు. ఈ స్కీమ్ కింద మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
కేంద్రప్రభుత్వం మహిళలకు మరో శుభవార్తనందించింది. మహిళలు స్వయం ఉపాధి కల్పనలో మరింత అభివృద్ధి సాధించి, ఆర్థికంగా ఎదిగేందుకు అన్ని విధాలా సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్తకొత్త స్కీమ్లు, రాయితీలు కల్పిస్తూ..తగిన ప్రొత్సహకాలు అందిస్తోంది. తాజాగా మహిళల స్వయం ఉపాధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో పథకాన్ని అందిస్తోంది. దీని పేరు మహిళా ఉద్యమ్ నిధి స్కీమ్. స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్ఐడీబీఐ ఈ పథకాన్ని అందిస్తోంది.
ఉమెన్ ఎంట్రప్రెన్యూర్లకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. అంటే వ్యాపారం, చేయాలని భావించే మహిళలు ఈ పథకాన్ని వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా బ్యాంకులు అర్హులైన మహిళలకు ఆకర్షణీయ వడ్డీ రేటుకే రుణాలు అందిస్తున్నాయి. ఉమెన్ ఎంటర్ప్రైజ్ ఫండ్ ద్వారా ఈ లోన్స్ పొందొచ్చు. ఈ స్కీమ్ కింద మహిళలకు రూ.10 లక్షల వరకు రుణం తీసుకునే అవకాశం ఉంది. తీసుకున్న రుణాన్ని 10 ఏళ్లలోపు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. చేసే వ్యాపారంలో కచ్చితంగా 51 శాతం వాటా ఉండాలి. ఎంఎస్ఎంఈ, ట్రేడింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలకు చెందిన బిజినెస్ చేయాల్సి ఉంటుంది. రూ.5 లక్షలకు తగ్గకుండా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రూ.10 లక్షలు దాటకూడదు. వడ్డీ రేట్లు సిడ్బి, బ్యాంకుల ఇష్టం. తగ్గించుకోవచ్చు లేదంటే పెంచుకోవచ్చు. బ్యాంకులు సర్వీస్ చార్జీల కింద 1 శాతం వసూలు చేస్తాయి.
ఆటో రిపేరింగ్ అండ్ సర్వీస్ సెంటర్, బ్యూటీ పార్లర్, కేబుల్ టీవీ నెట్వర్క్, క్యాంటీ, రెస్టారెంటు, కంప్యూటరైజర్డ్ డెస్క్టాప్ పబ్లిషింగ్, సైబర్ కేఫ్, ఫోన్బూత్, ల్యాండ్రీ, మొబైల్ రిపేరింగ్, ఫోటోకాపీ సెంటర్, టీవీ రిపేరింగ్, రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, సెలూన్, టైలరింగ్, టైపింగ్ మెషీన్, అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ వంటి పలు బిజినెస్లను ప్రారంభించొచ్చు. కొత్తగా వ్యాపారం చేయాలని భావించే వారు మాత్రమే కాకుండా ఇప్పటికే బిజినెస్ చేస్తున్న మహిళలు దాని కార్యకలాపాల విస్తరణకు కూడా రుణం తీసుకునే అవకాశం ఉంది.