కరోనా..’పిల్లల్ని చూడండయ్యా ! పాఠమే నేర్పారు’.. మోదీ
కరోనా భూతం ఇండియాలో తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. గత 24 గంటల్లో 37 మంది కరోనా రోగులు మృతి చెందారు. 12 వేలమందికి పైగా ఇన్ఫెక్షన్లు సోకాయి. (మొత్తం మృతుల సంఖ్య 414). 170 జిల్లాలను హాట్ స్పాట్ లుగా గుర్తించారు. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, జైపూర్ వంటి నగరాలు ఈ హాట్ స్పాట్ ‘వర్గీకరణ’లో ఉన్నాయి. కరోనా ఇంత బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం అవసరాన్ని హైలైట్ […]
కరోనా భూతం ఇండియాలో తన ప్రతాపాన్ని చూపుతూనే ఉంది. గత 24 గంటల్లో 37 మంది కరోనా రోగులు మృతి చెందారు. 12 వేలమందికి పైగా ఇన్ఫెక్షన్లు సోకాయి. (మొత్తం మృతుల సంఖ్య 414). 170 జిల్లాలను హాట్ స్పాట్ లుగా గుర్తించారు. హైదరాబాద్ సహా ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, జైపూర్ వంటి నగరాలు ఈ హాట్ స్పాట్ ‘వర్గీకరణ’లో ఉన్నాయి. కరోనా ఇంత బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో సామాజిక దూరం అవసరాన్ని హైలైట్ చేస్తూ కొంతమంది పిల్లలు చూపిన ‘మేల్కొలుపు ఆట’ ప్రధాని మోదీని ఆకర్షించింది. 60 సెకండ్ల ఆ వీడియోను ఆయన పోస్ట్ చేశారు.
‘బచ్చో నే ఖేల్ ఖేల్ మే జో బతా దియా ఉస్ మే కొరోనా మహమ్మారి సే బచ్ నే కీ ఏక్ బడీ సీఖ్ హై ‘ (ఈ పిల్లలు తమ ఆటల్లో ఏం చూపారంటే అందులో కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి ఓ గుణపాఠమే ఉంది) అని ఆయన ట్వీట్ చేశారు.
ఈ వీడియోలో ఓ కుర్రాడు ఇటుకలనన్నింటినీ వలయాకారంగా పేరుస్తాడు..ఈ ఇటుకలను మనుషులుగా భావిద్దామని, వీరిలో ఏ ఒక్కరికి కరోనా సోకినా ఇతరులకు కూడా ఎలా సోకుతుందో చూడండి అంటూ ఒక ఇటుకను కొద్దిగా ముందుకు తోస్తాడు. దాంతో వరుసలో ఉన్న ఇటుకలన్నీ ఒకదాని తరువాత ఒకటి పడిపోతాయి. కరోనా ఇలాగే వ్యాపిస్తుంది అంటాడా బాలుడు.. అయితే దీన్ని ఎలా ఆపాలంటూ మరో కుర్రాడు ప్రశ్నించగా.. ‘సింపుల్’ అంటూ మరొకడు ఇటుకల వరుసలో మధ్యలో ఉన్న ఓ ఇటుకను తీసేస్తాడు. అక్కడితో దానికి దూరంగా ఉన్న ఇటుకలు మాత్రం అలాగే ఉండిపోతాయి. ‘చైన్ ఆఫ్ ట్రాన్స్ మిషన్ బ్రోకెన్’ అన్నదే ఈ తమాషా ఆటలోని సిధ్ధాంతం.
కరోనా రోగి దగ్గినప్పుడో, తుమ్మినప్పుడో పడే తుంపర్ల కారణంగా ఇన్ఫెక్షన్లు ప్రబలుతున్నాయి. అందుకే సోషల్ డిస్టెన్స్ (సామాజిక దూరం) అన్న కాన్సెప్ట్ ముఖ్యాంశమైంది.
बच्चों ने खेल-खेल में जो बता दिया, उसमें कोरोना महामारी से बचने की एक बड़ी सीख है। pic.twitter.com/n13Z92zi2W
— Narendra Modi (@narendramodi) April 16, 2020