‘మా మంత్రులెవరూ విదేశాలకు వెళ్ళరు’.. మోదీ

కరోనా వ్యాప్తి నివారణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని అన్నారు ప్రధాని మోదీ. మొదట ఈ వైరస్ వ్యాపించకుండా చూసేందుకు తమ ప్రభుత్వం.

'మా మంత్రులెవరూ విదేశాలకు వెళ్ళరు'.. మోదీ
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 12, 2020 | 5:44 PM

కరోనా వ్యాప్తి నివారణకు తమ ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుందని అన్నారు ప్రధాని మోదీ. మొదట ఈ వైరస్ వ్యాపించకుండా చూసేందుకు తమ ప్రభుత్వంలోని మంత్రులెవరూ విదేశీ పర్యటనలకు వెళ్లబోరని ఆయన ట్వీట్ చేశారు. ‘సే నో టు ప్యానిక్’ (ఆందోళన చెందకండి), ‘సే ఎస్ టు ప్రికాషన్స్’  (ముందు జాగ్రత్త చర్యలకు ఎస్ చెప్పండి), అని పేర్కొన్న ఆయన.. రానున్న రోజుల్లో కేంద్ర మంత్రులు ఎవరూ విదేశీ ప్రయాణాలు చేయబోరని అన్నారు. అలాగే  ఈ దేశ ప్రజలు కూడా అవసరం లేని ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని కోరారు. ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా చూడాల్సి ఉందని, కరోనా ‘స్ప్రెడ్’ కు ‘బ్రేక్’ వేయవలసి ఉందని మోదీ అన్నారు. ప్రభుత్వం పూర్తి అప్రమత్తంగా ఉంది. ప్రజల సేఫ్టీకి అనుగుణంగా అన్ని శాఖలూ తగిన చర్యలు తీసుకుంటున్నాయి అని వివరించిన ఆయన..వీసాల జారీ నిలిపివేత ఇందులో భాగమేఅన్నారు.

ఇలా ఉండగా ఇండియాలో కరోనా కేసులు తాజాగా 73 నమోదు కాగా.. కేరళలో కరోనా కేసుల సంఖ్య 17 కి పెరిగింది. మరోవైపు..ఇరాన్ లో కరోనా కారణంగా 75 మంది మృతి చెందారు. ఆ దేశంలో చిక్కుబడిన భారతీయులను ఇండియాకు తీసుకువచ్చెందుకు విదేశాంగ శాఖ చర్యలు చేపట్టింది.