బాబాయ్‌కి బెయిల్ మంజూరు.. కార్య‌క‌ర్త‌ల‌కు అబ్బాయ్ రిక్వెస్ట్

మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మంజూరు అయ్యింది. తెలుగుదేశం పార్టీ, కింజ‌రాపు అభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయ జీవితంలో మ‌చ్చ‌లేని అచ్చెన్నాయుడు రాజ‌కీయ వేధింపుల‌తో పెట్టిన కేసుల నుంచి మీ అంద‌రి ఆశీస్సుల‌తో..

బాబాయ్‌కి బెయిల్ మంజూరు.. కార్య‌క‌ర్త‌ల‌కు అబ్బాయ్ రిక్వెస్ట్
Follow us

| Edited By:

Updated on: Aug 28, 2020 | 1:50 PM

ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన టీడీపీ నేత‌ అచ్చెన్నాయుడికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రెండు ల‌క్ష‌ల పూచీక‌త్తుపై బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు.. అనుమ‌తి లేనిదే దేశం విడిచి వెళ్ల‌రాద‌ని పేర్కొంది. అచ్చెన్నాయుడు విడుద‌ల‌పై.. ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు ట్వీట్ట‌ర్‌లో ట్వీట్ చేశారు.

”మా బాబాయ్ అచ్చెన్నాయుడు గారికి బెయిల్ మంజూరు అయ్యింది. తెలుగుదేశం పార్టీ, కింజ‌రాపు అభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించాయి. స్వ‌చ్ఛ‌మైన రాజ‌కీయ జీవితంలో మ‌చ్చ‌లేని అచ్చెన్నాయుడు రాజ‌కీయ వేధింపుల‌తో పెట్టిన కేసుల నుంచి మీ అంద‌రి ఆశీస్సుల‌తో బ‌య‌ట‌కొస్తారు. బెయిల్ వ‌చ్చినా బాబాయ్ క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ కావ‌డంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ద‌య‌చేసి ఎవ్వ‌రూ ప‌రామ‌ర్శ‌ల‌కు రావొద్దు. మీ అభిమాన‌మే మాకు కొండంత అండ‌. బాబాయ్ కోసం ప్రార్థించిన ప్ర‌తీ ఒక్క‌రికీ కింజ‌రాపు కుటుంబం త‌ర‌ఫున పేరు పేరునా కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ క‌ష్ట‌కాలంలో మా కుటుంబానికి అండ‌గా నిలిచిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబునాయుడు, టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లంద‌రికీ శిర‌సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నాను”.. అంటూ ట్వీట్ చేశారు ఎంపీ రామ్మోహ‌న్ నాయుడు.

Read More:

సీఎంవో సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌.. హోమ్ క్వారంటైన్‌లోకి సీఎం

139 మంది అత్యాచారం కేసులో కీల‌కంగా మారిన ‘డాల‌ర్ బాయ్’