దేశంలో తగ్గని కరోనా జోరు.. పెరుగుతున్న కేసులు
ఇండియాలో కరోనా జోరు కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ నమోదవుతున్న కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఇవి 13,495 కి చేరుకున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. 1777 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఈ సంస్థ పేర్కొంది. 448 మంది రోగులు మృతి చెందారు. కోలుకున్న వారికి, మృతులకు మధ్య నిష్పత్తి 80 : 20 గా ఉందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అంటే కోలుకున్న […]
ఇండియాలో కరోనా జోరు కొనసాగుతోంది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ నమోదవుతున్న కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం నాటికి ఇవి 13,495 కి చేరుకున్నట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెల్లడించింది. 1777 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు ఈ సంస్థ పేర్కొంది. 448 మంది రోగులు మృతి చెందారు. కోలుకున్న వారికి, మృతులకు మధ్య నిష్పత్తి 80 : 20 గా ఉందని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగాను, మృతుల సంఖ్య చాలా తక్కువగాను ఉన్న విషయాన్ని గమనించాలని ఆయన అన్నారు. ఇది ఇతర అనేక దేశాలకన్నా ఎక్కువగా (డిశ్చార్జ్ అయినవారి సంఖ్య) ఉందన్నారు. మహారాష్ట్రలో కరోనా పాజిటివ్ కేసులు 3 వేలకు చేరుకోగా.. ఢిల్లీలో 1600 కేసులు నమోదయ్యాయి.