మాస్కు లేకుంటే రూ. లక్ష ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష

భారత్‌ కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో బాధితులు మహమ్మారి బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా భారీగా నమోదు అవుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి.

మాస్కు లేకుంటే రూ. లక్ష ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష
Follow us

|

Updated on: Jul 23, 2020 | 5:13 PM

భారత్‌ కోవిడ్ భూతం కోరలు చాస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో బాధితులు మహమ్మారి బారినపడుతున్నారు. దేశవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా భారీగా నమోదు అవుతోంది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని పదేపదే సూచిస్తున్నాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదని హెచ్చరిస్తున్నాయి. కరోనా నియంత్రణ కోసం ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని హెచ్చరిస్తున్నాయి. అయినప్పటికీ కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ..నిబంధనలు భేఖతారు చేస్తున్నారు. అటువంటి వారిపట్ల జార్ఖండ్ ప్రభుత్వం కఠినమైన నిర్ణయాలు తీసుకుంది.

కరోనా నిబంధనలు పాటించని వారి పట్ల జార్ఘండ్ ప్రభుత్వం కఠిన చర్యలు అమలు చేయనున్నట్లు ప్రకటించింది. వైరస్ వ్యాప్తి నియంత్రణ కోసం ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించని వారికి రూ.లక్ష జరిమానా, రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించాలని నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో జార్ఖండ్ కంటేజియస్ డిసీజ్ ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీని ప్రకారం కరోనా నిబంధనలను ఉల్లంఘించిన వారికి గరిష్టంగా లక్ష రూపాయల జరిమానా లేదా రెండేళ్ల జైలు శిక్ష లేదా రెండూ కలిపి విధించే అవకాశం ఉంది.

కాగా, జార్ఖండ్‌లో ఇప్పటి వరకు 6485 మంది కరోనా బారినపడ్డారు. అందులో 3024 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 3397 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.