తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!

పలు రాష్ట్రాలలోని 30 నగరాలలోనే 80 శాతం కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రాంతాల్లోనే కఠిన ఆంక్షలు!
Follow us

|

Updated on: May 17, 2020 | 12:27 PM

మూడోదశ లాక్ డౌన్ నేటితో ముగియనుండగా.. రేపటి నుంచి ప్రారంభమయ్యే లాక్ డౌన్ 4.0కు ఇప్పటికే ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం సిద్దం చేసింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్రాలలోని 30 నగరాలలోనే 80 శాతం కోవిడ్ 19 కేసులు నమోదవుతున్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో కఠినంగా ఆంక్షలు అమలు చేయాలని రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్న హైదరాబాద్, కర్నూలు ప్రాంతాలు ఆ జాబితాలో ఉన్నాయి. దీనితో లాక్ డౌన్ 4.0కి సంబంధించి కేంద్రం విడుదల చేసే మార్గదర్శకాలను కట్టుదిట్టంగా అమలు చేసేందుకు తెలుగు రాష్ట్రల ప్రభుత్వాలు సిద్దమయ్యాయి. కాగా, ఈ లాక్ డౌన్‌లో పరిమిత సంఖ్యలో ప్రజారవాణా తిరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Read More:

ఏపీలో జిల్లాల వారీగా రెడ్ జోన్ ప్రాంతాలు ఇవే..

వలస కూలీలకు ఉచిత ప్రయాణం.. జగన్ మార్క్ డెసిషన్

తెలంగాణ ప్రభుత్వం సంచలనం.. ఆ మూడు రాష్ట్రాల నుంచి రాకపోకలు నిషేధం..

రేపటి నుంచి లాక్‌డౌన్‌ 4.0.. రూల్స్ ఇలా ఉండనున్నాయా!