85 ఏళ్ళ వయస్సులో కరోనాపై క్యాన్సర్ రోగి విజయం
ఒడిషాలో 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు. ఈ వైరస్ బారిన పడిన అతని భార్య కూడా పూర్తిగా కోలుకుంది. సురేంద్ర పతి అనే ఈ వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఇతనికి కరోనా వైరస్ సోకగా.78 ఏళ్ళ . ఇతని భార్య..
ఒడిషాలో 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు. ఈ వైరస్ బారిన పడిన అతని భార్య కూడా పూర్తిగా కోలుకుంది. సురేంద్ర పతి అనే ఈ వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. ఇతనికి కరోనా వైరస్ సోకగా.78 ఏళ్ళ . ఇతని భార్య సావిత్రి కూడా ఈ వైరస్ కి గురయింది. కటక్ లోని ఆచార్య హరిహర్ రీజనల్ క్యాన్సర్ ఆసుపత్రిలో జూన్ 8 న సురేంద్ర పతి చేరాడు. అప్పటి నుంచి ఇతనికి ఖీమోథెరపీ, ఇతర వైద్య చికిత్సలు చేస్తూ వచ్చారు డాక్టర్లు.. జూన్ 29 న ఇతని భార్య సైతం కరోనావైరస్ బారిన పడిందని, అయితే క్రమంగా భార్యాభర్తలిద్దరూ దీని నుంచి పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశామని డాక్టర్లు తెలిపారు. కరోనాపై విజయం సాధించిన వీరు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని వారు పేర్కొన్నారు.
Sh Surendra Pati, aged 85 years and suffering from cancer, and his wife Smt Sabitri pati, aged 78, both have beaten Corona and have been discharged from COVID care, in kendrapara. Our best wishes to them. They inspire many to beat the disease. pic.twitter.com/B1E4WfXI8g
— Collector Kendrapara?? (@dmkendrapara) July 17, 2020