Omicron: మీ మాస్క్ ఒమిక్రాన్ని ఆపుతుందా..! నిపుణుల అధ్యయనంలో షాకింగ్ నిజాలు
Omicron: కరోనా వైరస్ ప్రమాదకరమైన వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది.
Omicron: కరోనా వైరస్ ప్రమాదకరమైన వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోంది. భారతదేశంలో చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. తక్కవ రోజుల్లోనే 400 కేసులు నమోదయ్యాయి. Omicron ప్రమాదం దృష్ట్యా నిపుణులు మాస్క్ను అప్గ్రేడ్ చేయాలని సూచిస్తున్నారు. Omicron వేరియంట్ ఎంత ప్రమాదకరమంటే దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన నెలలోపే దాదాపు 100 కంటే ఎక్కువ దేశాలకు వ్యాపించింది. అధిక సంఖ్యలో ప్రజలు దీని బారిన పడుతున్నారు. భారతదేశంలో ఈ సంఖ్య 400 మార్కును దాటింది.
మాస్క్ల గురించి నిపుణులు ఏమంటున్నారు కరోనా వైరస్పై యుద్ధం కోసం మాస్కులకు బదులుగా “యూనివర్సల్ వ్యాక్సిన్”ని అప్గ్రేడ్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని చెబుతున్నారు. జార్జ్ వాషింగ్టన్ యూనివర్శిటీ ప్రొఫెసర్, మెడికల్ అనలిస్ట్ డాక్టర్ లీనావెన్ క్లాత్ మాస్క్లు కేవలం అలంకరణ కోసం మాత్రమే అన్నారు. ఇది ఒమిక్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపలేదని స్పష్టం చేశారు. కాబట్టి బలమైన వేరియంట్ని ఆపాలంటే కనీసం మూడు-ప్లై సర్జికల్ మాస్క్ ధరించాలని సూచించారు. దానిపై క్లాత్ మాస్క్ ధరించవచ్చు కానీ ముందే క్లాత్ మాస్క్ అస్సలు ధరించవద్దని చెప్పారు. అదేవిధంగా మసాచుసెట్స్లోని డార్ట్మౌత్ విశ్వవిద్యాలయంలో జీవశాస్త్ర అసోసియేట్ ప్రొఫెసర్ ఎరిన్ బ్రోమేజ్ క్లాత్ మాస్క్లు పెద్ద బిందువులను ఫిల్టర్ చేయలేవని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికాలో ఈ వేరియంట్ను గుర్తించిన వెంటనే ఓమిక్రాన్ ప్రపంచ దేశాలలో దావానంలా వ్యాపించడం ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఫేస్ మాస్క్ల వాడకం తగ్గుముఖం పట్టడంపై భారత ప్రభుత్వం హెచ్చరించింది. COVID-19 పరిస్థితిపై విలేకరుల సమావేశంలో NITI ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ VK పాల్ మాట్లాడుతూ భారతదేశంలో మాస్క్ల వాడకం తగ్గుతోందని ప్రజలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అన్నారు. మాస్క్ టీకా రెండు కచ్చితంగా అవసరమని గుర్తు చేశారు. భారతదేశం ఇప్పటివరకు 37 మ్యుటేషన్లను కలిగి ఉన్న ఓమిక్రాన్ వేరియంట్కి సంబంధించి 430 కంటే ఎక్కువ కేసులను నమోదు చేసింది. కరోనా వైరస్ ఇతర రకాల కంటే ఇది చాలా ప్రమాదకరమైనది.