లాక్డౌన్ పట్టించుకోని వారికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల షాక్.. ఏకంగా..
కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలసిందే. అయితే పలురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ ఉన్న చోట్ల.. అక్కడి రాష్ట్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వాహనాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకి రావాలని హెచ్చరికలు జారీచేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు వాహనదారులు అవన్నీ పట్టించుకోకుండా.. యథేచ్చగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్లో కూడా అదే జరిగింది. పోలీసులు రోడ్లపైకి రావద్దంటూ ఎంత చెప్పినా.. వీ […]
కరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న విషయం తెలసిందే. అయితే పలురాష్ట్రాల్లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఎక్కువ ఉన్న చోట్ల.. అక్కడి రాష్ట్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. వాహనాదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ రోడ్లపైకి రావొద్దని.. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకి రావాలని హెచ్చరికలు జారీచేస్తున్నాయి. అయినప్పటికీ కొందరు వాహనదారులు అవన్నీ పట్టించుకోకుండా.. యథేచ్చగా లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వచ్చేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్లో కూడా అదే జరిగింది. పోలీసులు రోడ్లపైకి రావద్దంటూ ఎంత చెప్పినా.. వీ డోంట్ కేర్ అంటూ రోడ్లపైకి వచ్చేశారు వాహనదారులు. ఏప్రిల్ 8 వ తేదీ నుండి 10 వ తేదీ వరకు.. మూడు రోజుల్లో రోడ్లపైకి టూవీలర్ వెహికిల్స్ 47,307 వచ్చాయని.. త్రీ వీలర్స్ 1,742.. ఫోర్ వీలర్స్ 4,164.. ఇలామొత్తం 53,195 వాహనాలు వచ్చినట్లు సర్వైవలెన్స్ కెమెరాల ద్వారా ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. వీరందరిపై నిబంధనలు ఉల్లంఘిచినట్లు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
దీంతో పాటు ట్రాఫిక్ పోలీసులు స్వయంగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో కూడా పట్టుబడ్డ వాహనదారులపై కేసులు నమోదు చేశారు. ఇలా పట్టుబడ్డ వాహనదారుల్లో టూవీలర్ వాహనాలు 10,595, త్రీ వీలర్ వాహనాలు 769, ఫోర్ వీలర్ వాహనాలు 1,012.. ఇలా మొత్తం12,376 మంది వాహనదారులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
కాగా..ఇప్పటివరకు సీజ్ చేసిన వాహనాల్లో.. టూవీలర్స్ 5,019 ఉండగా..త్రీ వీలర్స్ 537, ఫోర్ వీలర్స్ 265 ఉన్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.