పల్లెలకూ పాకుతోంది… గ్రామాల్లో అమల్లోకి 144 సెక్షన్ !

కరోనా వైరస్‌ అతి వేగంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. కాగా, పట్టణాలను వణికిస్తున్న వైరస్ ఇప్పుడు పల్లెలకు పాకుతోంది. నగరవాసులు గ్రామాల బాటపడుతున్న క్రమంలో గ్రామాల్లోనూ ఆంక్షాలు విధించాలని నిర్ణయించింది ప్రభుత్వం...

పల్లెలకూ పాకుతోంది... గ్రామాల్లో అమల్లోకి 144 సెక్షన్ !
Follow us

|

Updated on: Mar 21, 2020 | 11:16 AM

కరోనా కల్లోలం నేపథ్యంలో దేశవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. కోవిడ్-19 మహమ్మారి ఎటు నుంచి ఎప్పుడు ఎలా వచ్చి కొంపముంచుతుందోననే భయం ప్రతిఒక్కరినీ వెంటాడుతోంది. కరోనా వైరస్‌ అతి వేగంగా వ్యాపించడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పటిష్ఠ చర్యలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ మహమ్మారిని నియంత్రించడానికి ప్రజల్లో అవగాహన కల్పించాడనికి అనేక కార్యక్రమాలను చేపడుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ.. రేపు జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చారు. కాగా, పట్టణాలను వణికిస్తున్న వైరస్ ఇప్పుడు పల్లెలకు పాకుతోంది. నగరవాసులు గ్రామాల బాటపడుతున్న క్రమంలో గ్రామాల్లోనూ ఆంక్షాలు విధించాలని నిర్ణయించింది ప్రభుత్వం.

కొవిడ్-19, విస్తరిస్తున్న క్రమంలో ప్రభుత్వ కార్యాలయాలు, అత్యవసర విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పలు సూచనలు చేసింది ప్రభుత్వం. కోవిడ్‌ దరిచేరకుండా ప్రతి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించింది. ఇందులో భాగంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం బయట బకెట్‌ నీళ్లు, సబ్బు అందుబాటులో ఉంచాలని నిర్దేశించింది. కార్యాలయంలోకి ప్రవేశించే ముందు శుభ్రంగా కాళ్లు, చేతులు కడుక్కున్న తర్వాతే అనుమతించాలని, ఈ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినా ఊరుకోవద్దని తేల్చిచెప్పింది. కరోనా నేపథ్యంలో విధుల నిర్వహణలో షిఫ్ట్‌ల పద్ధతి పాటించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఎంపీడీవో, తహసీల్దార్లు, వైద్యాధికారులతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా శాఖల ఉన్నతాధికారులు దిశానిర్దేశం చేశారు.

అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ఆంక్షాలు విధించింది ప్రభుత్వం. సామూహిక కార్యక్రమాలను ప్రభుత్వం రద్దు చేసింది. తెలంగాణలో పెళ్లిళ్లను కూడా రద్దు చేసుకోవాలని సూచించింది. ఇక ఇప్పటికే అనేక ఆలయాలు, ప్రార్థన మందిరాలు, సినిమా థీయేటర్లు, పార్కులు, పబ్బులు వంటివి మూతపడ్డాయి. ఈ క్రమంలోనే తాజాగా , గ్రామాల్లోనూ నిషేధాజ్ఞలు విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడొద్దని ఆదేశించింది. 144 సెక్షన్‌ తరహాలో సామూహిక జనసంచారం లేకుండా ఆంక్షలు అమలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించింది.

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామాల్లో కొత్త వ్యక్తుల రాకపోకలపై నిఘా పెట్టాలని సూచించింది. కొత్త వ్యక్తులు ఎవరొచ్చినా.. ఆ సమాచారాన్ని నమోదు చేసుకోవాలని, రోజువారీ నివేదికలను స్థానిక ఎంపీడీవో, తహసీల్దార్లకు సమర్పించాలని ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారిపై మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, వారు ఏ దేశం నుంచి, ఏ విమానంలో వచ్చారు.. ఎప్పుడు, ఎక్కడ దిగారు.. అక్కడి నుంచి గ్రామానికి చేరుకునేసరికి మార్గమధ్యలో ఎవరెవరిని కలిశారు.. ఎక్కడ ఆగారనే వివరాలు నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. సదరు వ్యక్తులు దేశానికి చేరుకుని 14 రోజులు కాకపోతే స్వీయ క్వారంటైన్‌ వెళ్లేలా ఒత్తిడి చేయాలని, రోజూ ఆ వ్యక్తుల కదలికలపై కన్నేసి ఉంచాలని స్పష్టం చేసింది.

కొత్తగా ఊర్లోకి వచ్చిన వ్యక్తులకు జలుబు, దగ్గు, జ్వరం ఉన్నట్లు గుర్తిస్తే తక్షణమే ఆస్పత్రులకు పంపాలని ఆదేశించింది. విదేశాల నుంచి వచ్చిన వారేకాకుండా.. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారి వివరాలు కూడా సేకరించాలని సూచించింది. ఇలా 26 అంశాలతో కూడిన నమూనాను పంచాయతీ కార్యదర్శులకు ప్రభుత్వం అందజేసింది. ఈ నమూనాలో ప్రతిరోజు సమాచారం పంపాలని స్పష్టం చేశారు. అన్ని సమావేశాలను రద్దు చేసుకోవాలని, చట్టబద్ధంగా జరగాల్సిన సమావేశాలైతే, పరిమిత సంఖ్యలో హాజరయ్యేలా చూసుకోవాలని పేర్కొంది.

దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (మార్చి 29, 2024): 12 రాశుల వారికి ఇలా..
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!