కరోనా ఎఫెక్ట్ః అధ్యాపకులకు త్వరలో కార్పొరేట్ షాక్
తెలంగాణలో లాక్డౌన్ ఎఫెక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్లు, జూనియర్ కాలేజీ లెక్చర్లపై పడింది. 2020-21 సంవత్సరానికి ముందే కొన్ని కాలేజీలు, స్కూళ్లు
కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలతో పాటు భారత్ను వణికిస్తోంది. సరైన వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో నివారణ ఒక్కటే మార్గం అని భావించి ఆయా దేశాల ప్రభుత్వాలు లాక్డౌన్ను అమలు చేస్తున్నాయి. గత రెండు నెలలుగా సుమారుగా అన్ని దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. దీంతో వలస కూలీలు, కార్మికులు, కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో లాక్డౌన్ ఎఫెక్ట్ బడిపంతుళ్లపై పడింది.
తెలంగాణలో లాక్డౌన్ ఎఫెక్ట్ ప్రైవేట్ స్కూల్ టీచర్లు, జూనియర్ కాలేజీ లెక్చర్లపై పడింది. 2020-21 సంవత్సరానికి ముందే కొన్ని కాలేజీలు, స్కూళ్లు తమ స్టాఫ్ని తగ్గించే యోచనలో ఉన్నాయట. ఆయా విద్యాసంస్థలు నిర్వహిస్తున్న ఏరియాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉన్న కారణంగా విద్యార్థుల అడ్మిషన్లు కూడా తగ్గిపోయే అవకాశం ఉందని భావించిన ఆయా యజమాన్యాలు..ముందస్తుగానే నిర్వహణ భారాన్ని తగ్గించుకునే పనిలో పడ్డాయట. ఈ మేరకు వచ్చే విద్యా సంవత్సరం నాటికి సుమారుగా 40 శాతం సిబ్బందిని ఉద్యోగాల్లోంచి తొలగించే అవకాశం ఉందని పలువురు ప్రైవేటు ఉద్యోగులు, టీచర్లు చెబుతున్నారు.