AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో కొత్తగా 42 పాజిటివ్ కేసులు..!

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అందులో 34 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1634కు చేరింది. ఇక కరోనాతో ఇవాళ నలుగురు మృతి చెందగా.. మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 38కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉండగా.. 1011 మంది డిశ్చార్జి […]

కరోనా అప్‌డేట్స్: తెలంగాణలో కొత్తగా 42 పాజిటివ్ కేసులు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 19, 2020 | 9:50 PM

Share

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 42 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.అందులో 34 జీహెచ్ఎంసీ పరిధిలోనివి కాగా.. 8 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 1634కు చేరింది. ఇక కరోనాతో ఇవాళ నలుగురు మృతి చెందగా.. మహమ్మారితో మరణించిన వారి సంఖ్య 38కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 585 యాక్టివ్ కేసులు ఉండగా.. 1011 మంది డిశ్చార్జి అయ్యారు.

ఇక అటు ఏపీలో గడిచిన 24 గంటల్లో 57 కొత్త కేసులు నమోదయ్యాయి. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా 691 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1596 మంది కరోనా నుంచి కోలుకోగా.. మృతుల సంఖ్య 52కు చేరింది.

Read This Story Also: Flash News: ఏపీలో ఎల్లుండి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభం.. వివరాలివే..!