దీనస్థితిలో పాకిస్థాన్.. భారత్ను సాయం కోరుతున్న అక్తర్..
Coronavirus Outbreak: ఎప్పుడూ సరిహద్దుల్లో యుద్ధానికి ఉసిగొలిపే దాయాది దేశం పాకిస్తాన్ దీనస్థితిలో ఇండియాను సాయం చేయమంటూ ప్రాధేయపడుతోంది. తమ దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు భారత్ సాయమందించాలని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోందని.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవని వివరించాడు. ఈ విషయంలో భారత్ తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం తమ దేశానికి 10 వేలకు పైగా […]
Coronavirus Outbreak: ఎప్పుడూ సరిహద్దుల్లో యుద్ధానికి ఉసిగొలిపే దాయాది దేశం పాకిస్తాన్ దీనస్థితిలో ఇండియాను సాయం చేయమంటూ ప్రాధేయపడుతోంది. తమ దేశంలో కరోనా వైరస్ను కట్టడి చేసేందుకు భారత్ సాయమందించాలని ఆ దేశ క్రికెటర్ షోయబ్ అక్తర్ కోరాడు. ప్రస్తుతం పాకిస్తాన్ విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోందని.. కరోనా రోగులకు చికిత్స అందించేందుకు తగినన్ని వెంటిలేటర్లు కూడా లేవని వివరించాడు. ఈ విషయంలో భారత్ తమకు సాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
ప్రస్తుతం తమ దేశానికి 10 వేలకు పైగా వెంటిలేటర్ల అవసరం ఉందని.. అవి లేకపోవడంతో మరణాల సంఖ్య ఎక్కువ అవుతోందని వివరించాడు. ఇరు దేశాల మధ్య ఉన్న వివాదాలను పక్కన పెట్టి మానవతా దృక్పధంతో భారత్ ముందుకు రావాలని కోరాడు. దీనితో పాటు విరాళాల కోసం ఇరు దేశాల మధ్య మూడు వన్డేల సిరీస్ జరపాలనే ప్రతిపాదనను కూడా అక్తర్ ముందుకు తీసుకొచ్చాడు. ఈ సిరీస్ ఆడితే వచ్చిన డబ్బుతో… కరోనాపై పోరాటం చేయవచ్చునని చెప్పుకొచ్చాడు.
అయితే షోయబ్ అక్తర్ చేసిన కామెంట్స్ను మాజీ క్రికెటర్ కపిల్ దేవ్ తో పాటు ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్లను రిస్క్లో పెట్టాల్సిన అవసరం లేదని.. బీసీసీఐ దగ్గర కావల్సినంత డబ్బు ఉందని అంటూ టీమిండియా మాజీ ఆల్రౌండర్ కపిల్ దేవ్ అక్తర్కు చురకలు అంటించాడు.
అటు అక్తర్ వ్యాఖ్యలపై ఐపీఎల్ మాజీ చైర్మన్ రాజీవ్ శుక్లా కూడా మండిపడ్డాడు. కరోనా విరాళాల కోసం భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య సిరీస్ నిర్వహించాలని అక్తర్ చెప్పిన సూచన చాలా సరదాగా ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు లేవు, ఐపీఎల్ నిర్వహించడానికే సాధ్యపడటం లేదు. ఇలాంటి సమయంలో మూడు వన్డేల సిరీస్ ఎలా సాధ్యపడుతుంది. కరోనా వ్యాప్తి ఉన్నప్పుడు ఒక దేశంలోకి మరో దేశం ఆటగాళ్లను ఎలా అనుమతిస్తారు.? అని అక్తర్ను సూటిగా ప్రశ్నించాడు.
ఇది చదవండి: కరోనా వేళ.. చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన భారత్…