ఆసుపత్రుల్లో ఓపీ సేవలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. కరోనా రోగులతోనే అన్ని హాస్పిటల్స్ నిండిపోయాయి. దీనితో ఏపీ ప్రభుత్వం ఓపీ సేవలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణ రోగులను చూసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఔట్ పేషంట్ సేవలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ […]
Coronavirus Outbreak: ఏపీలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఔట్ పేషంట్(ఓపీ) సేవలు ఆగిపోయాయి. కరోనా రోగులతోనే అన్ని హాస్పిటల్స్ నిండిపోయాయి. దీనితో ఏపీ ప్రభుత్వం ఓపీ సేవలపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
సాధారణ రోగులను చూసేందుకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఔట్ పేషంట్ సేవలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. వారి కోసం ప్రత్యేక ప్రవేశ మార్గాలను కూడా ఏర్పాటు చేయాలని ఆసుపత్రులకు ఆదేశాలిచ్చింది. కాగా, ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 381కు చేరింది. అత్యధికంగా కర్నూలులో 77 కేసులు నమోదయ్యాయి.
ఇవి చదవండి:
ఫ్లాష్: మోదీ ప్రకటనకు ముందే.. లాక్ డౌన్ పొడిగించిన మరో రాష్ట్రం..