మరో 30కి.మీలలో ఇల్లు ఉందనగా.. ‘కరోనా’తో వలస కూలీ మృతి..!
లాక్డౌన్ కొనసాగిస్తోన్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైన విషయం తెలిసిందే.
లాక్డౌన్ కొనసాగిస్తోన్న నేపథ్యంలో వలస కూలీలను వారి స్వగ్రామాలకు పంపేందుకు అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చాలా మంది ఇప్పటికే తమ ఊర్లకు చేరుకున్నారు. కాగా మరో 30కి.మీలలో తన ఇల్లు ఉందనగా.. ఓ వలసకూలీ కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్లోని సంత్ కబీర్ నగర్కి చెందిన రామ్ క్రిపాల్ అనే వ్యక్తి ముంబయిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇన్ని రోజులు ముంబయిలోనే ఉండిపోయిన రామ్.. తాజాగా తన ఇంటికి వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో ఓ ట్రక్కులో నాలుగు రోజులుగా 1600కి. మీలు ప్రయాణించారు. మరో 30 కి.మీలలో అతడి సొంత గ్రామం ఉందనగా.. సృహ తప్పి కిందపడ్డాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ.. అప్పటికే చనిపోయినట్లు పోలీసులు నిర్దారించారు. ఆ తరువాత అతడికి జరిపిన పరీక్షల్లో కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో ట్రక్లో అతడు కాంటాక్ట్ అయిన వారి వివరాలను పోలీసులు కనుగొనే పనిలో పడ్డారు. కాగా వలస కార్మికులు వారి వారి స్వరాష్ట్రాలకు వెళుతోన్న క్రమంలో.. కరోనా కేసులు మరిన్ని భయటపడుతున్నాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలోకి వస్తోన్న కొత్త వారి వివరాలను తెలపాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయి.
Read This Story Also: హరీష్ వర్సెస్ బండ్ల.. వివాదం ముగిసేలా లేదుగా..!