లాక్ డౌన్ వేళ.. కార్లు, బైకులు వాడితే సీజ్.. పోలీసుల హెచ్చరిక..
Coronavirus Lockdown: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన కొంతమంది ప్రజలు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక పోలీస్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో బైకులు, కార్లు వాడితే సీజ్ చేస్తామని కర్ణాటక డీజీపీ హెచ్చరించారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో భాగంగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా […]
Coronavirus Lockdown: దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన కొంతమంది ప్రజలు ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఈ నేపధ్యంలో కర్ణాటక పోలీస్ శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 14 వరకూ రాష్ట్రంలో బైకులు, కార్లు వాడితే సీజ్ చేస్తామని కర్ణాటక డీజీపీ హెచ్చరించారు.
రాష్ట్రంలో లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడంలో భాగంగా.. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. ‘ఇదేమీ ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాదు. లాక్ డౌన్ ను పట్టించుకోకుండా ఏప్రిల్ 14 వరకు బైకులు, కార్లు వాడితే సీజ్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ పై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది తమ దగ్గర పాస్లు ఉన్నాయని.. మరికొందరు తమకు అనుమతులు ఉన్నాయని కామెంట్స్ పెడుతున్నారు.
రెండు రోజుల క్రితమే తమకు ఆర్డర్లు వచ్చాయని.. ఇప్పటికే 5200 వాహనాలను సీజ్ చేశామని బెంగళూరు పోలీస్ కమీషనర్ భాస్కర్ రావు తెలిపారు. పక్కనే ఉన్న కిరణా షాపులకు బైకుపై కాకుండా నడిచి వెళ్ళాలని సూచించారు. మరోవైపు తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా లాక్ డౌన్ రూల్స్ అతిక్రమించిన వారి వాహనాలను సీజ్ చేయడం.. లేదా ఫైన్లు వేయడం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
For More News:
మందుబాబులకు మరో షాక్.. మద్యం అమ్మకాలు ఇక లేనట్లే..
కరోనాను దాచిపెట్టిన చైనా.. బయటపడ్డ సంచలన రహస్యాలు..
కరోనా లాక్ డౌన్.. రూల్స్ అతిక్రమిస్తే కాల్చెయ్యండి..
కిమ్ ఇలాకాలో.. నో కరోనా.. నిజమేనా.!
ఏప్రిల్ 15 నుంచి టికెట్ల రిజర్వేషన్లు.. రైల్వే శాఖ క్లారిటీ..
ఆరు వారాల చిన్నారిని మింగేసిన కరోనా…
ఆపరేషన్ నిజాముద్దీన్.. మర్కజ్ చీఫ్తో సహా ఏడుగురికి నోటిసులు..
This is not an April Fool’s prank. Two/ four wheelers are banned from use till the 14th of April. We will SEIZE your vehicle if you CEASE to ignore this lockdown regulation.
— DGP KARNATAKA (@DgpKarnataka) April 1, 2020